సౌందర్యం: పండ్లు, ఫలాలతో మీ అందం రెట్టింపురకరకాల సౌందర్యసాధనాలు వాడుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు పండ్లు.. కూరగాయలతో చేసుకునే చికిత్సలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం...
* నారింజ రసాన్ని ముఖానికి రాసుకోండి. చర్మం మృదువుగా మారుతుంది. తాజాగానూ కనిపిస్తుంది.
* అరకప్పు పాలకు రెండు చెంచాల తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఇది చర్మానికి టోనర్లా పనిచేస్తుంది.
* క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే ముడతలు కనిపించవు.
* మూడు చెంచాల రోజ్ వాటర్కు చెంచా గ్లిసరిన్ కలిపితే చక్కని మాయిశ్చరైజర్ అవుతుంది.
* రెండు చెంచాల నిమ్మ రసానికి చెంచా తేనె కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. ఇది ఏ కాలంలోనైనా చర్మానికి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది.
* ఎర్రచందనం, తేనె కలిపి తయారుచేసే ప్యాక్ చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మృదువుగానూ మారుస్తుంది.
* బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేయాలి. మొటిమలు మాయం కావడమే కాదు.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
* జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు ఇలా చేయవచ్చు. గోధుమ పిండిలో నీరు కలిపి ముఖానికి ప్యాక్ వేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
* పెట్రోలియం జెల్లీ, గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి పట్టిస్తే... పొడిచర్మం గలవారికి మంచి ప్రయోజనం ఉంటుంది.
* బాదం పొడి, పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. ముఖం, మెడ, చేతులకు ప్యాక్లా వేయాలి. కాసేపయ్యాక స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. కాంతిమంతంగానూ కనిపిస్తుంది.
* నెలకోసారి ఏం చేస్తారంటే.. గుప్పెడు వేపాకులను తీసుకోండి. దీనికి కొద్దిగా పసుపు కలిపి.. మెత్తగా చేయండి. ముఖమే కాదు.. కాళ్లు, చేతులకూ రాసుకోండి. కాసేపయ్యాక కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు దరిచేరవు.
* నారింజ రసాన్ని ముఖానికి రాసుకోండి. చర్మం మృదువుగా మారుతుంది. తాజాగానూ కనిపిస్తుంది.
* అరకప్పు పాలకు రెండు చెంచాల తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఇది చర్మానికి టోనర్లా పనిచేస్తుంది.
* క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే ముడతలు కనిపించవు.
* మూడు చెంచాల రోజ్ వాటర్కు చెంచా గ్లిసరిన్ కలిపితే చక్కని మాయిశ్చరైజర్ అవుతుంది.
* రెండు చెంచాల నిమ్మ రసానికి చెంచా తేనె కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. ఇది ఏ కాలంలోనైనా చర్మానికి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది.
* ఎర్రచందనం, తేనె కలిపి తయారుచేసే ప్యాక్ చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మృదువుగానూ మారుస్తుంది.
* బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేయాలి. మొటిమలు మాయం కావడమే కాదు.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
* జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు ఇలా చేయవచ్చు. గోధుమ పిండిలో నీరు కలిపి ముఖానికి ప్యాక్ వేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
* పెట్రోలియం జెల్లీ, గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి పట్టిస్తే... పొడిచర్మం గలవారికి మంచి ప్రయోజనం ఉంటుంది.
* బాదం పొడి, పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. ముఖం, మెడ, చేతులకు ప్యాక్లా వేయాలి. కాసేపయ్యాక స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. కాంతిమంతంగానూ కనిపిస్తుంది.
* నెలకోసారి ఏం చేస్తారంటే.. గుప్పెడు వేపాకులను తీసుకోండి. దీనికి కొద్దిగా పసుపు కలిపి.. మెత్తగా చేయండి. ముఖమే కాదు.. కాళ్లు, చేతులకూ రాసుకోండి. కాసేపయ్యాక కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు దరిచేరవు.
Comments
Post a Comment